తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కొన్ని సినిమాలతో నటుడిగా మంచి  గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సురేష్. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు ఈయన. ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే కొనసాగుతున్నాడు అప్పట్లో ఆయన నటన చూసి శోభన్ బాబు లాంటి టాప్ హీరోలు మారతారని అందరూ అనుకునేవారట. అయితే ఈ విషయాన్ని తాజాగా సినీ రచయిత అయినటువంటి పరుచూరి వెల్లడించారు. నటుడు సురేష్ గురించి అనేకమైన ఆసక్తికరమైన విషయాలను ఈయన బయటపెట్టారు. ఇక క్విట్ ఇండియా అనే సినిమాను గోపాలకృష్ణ మరియు సురేష్ ఇద్దరు కలిసి చేసినట్లుగా ఆయన చెప్పారు. 

ఆ సినిమాలో వాణి విశ్వనాథ్ హీరోయిన్ గా కూడా చేశారట. ఇకపోతే ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో ఏమని అందుకే అందరం కలిసి అప్పట్లో ఒకే రూమ్ లో ఉన్నామని చాలా విషయాలను మేమందరం కలిసి పంచుకుందాం అని పరుచూరి చెప్పడం జరిగింది. అయితే అలా వారందరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో సురేష్ వాణి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గారితో చెప్పినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే వాణి కేరళలో ఒక వీధి అంతా కొన్ని చేసినట్లుగా సురేష్ తో చెప్పాడు. కాకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్ గా కూడా మంచి మంచి అవకాశాలను తను అందుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాకపోతే సురేష్ సినిమా షూటింగ్ లో ఉంటే ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు అని పరుచూరి చెప్పారు.

సురేష్ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసేవారట. తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో చేసి ఉంటే సురేష్ కూడా శోభన్ బాబు ఇలాంటి హీరో అయ్యేవాడని ఆయన చెప్పుకొచ్చాడు. తర్వాత ఆయన తోటి కోడలు అనే సినిమా సురేష్ తో కలిసి చేశాడట. అయితే మొదటగా ఈ సినిమాలో వెంకటేష్, మీనా, శారద, రోజా నటించాల్సి ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ అప్పట్లో ఆ సినిమా చిన్న సినిమాని వారి చేయమని చెప్పారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అని దాని తర్వాత ఆ సినిమాలో నటించిన వారందరూ చిన్నచిన్న నటులే అంటూ ఆయన తెలియజేశారు. మంచి విజయాన్ని అందుకోవడానికి కారణం ఇదే ఏమో అని ఆయన చెప్పాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: