ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కేవలం ఒకే ఒక్క సినిమాతో యూత్ గుండెల్లో బేబమ్మగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ పేరు ఇప్పుడు తెగ మర్మోగిపోతోంది. అందం ఇంకా అభినయం కలబోతతో తొలి సినిమా `ఉప్పెన`తోనే నిరూపించుకుంది.ఇక హీరోయిన్ గా తన ఎంట్రీ తోనే హద్దులు చెరిపేసి ఇంటిమేట్ సన్నివేశాల్లో చెలరేగింది.అలాగే నటిగా కూడా మంచి పేరు సంపాదించింది.ఇక `ఉప్పెన` అయితే కమర్శియల్ గా పెద్ద సక్సెస్ అయింది. ఇటీవలే నేచురల్ స్టార్ నాని సరసన `శ్యామ్ సింగారాయ్` లోనూ తన హాట్ పెర్పార్మెన్స్ తో చెలరేగిన సంగతి తెలిసిందే. మరోసారి పెదవి ముద్దు సీన్ ల్లో బేబమ్మ సత్తా చాటింది. సీన్ డిమాండ్ చేస్తే ఎంతటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం ఆలోచించచని అలాగే వెనక్కి తగ్గేదే లేదని పబ్లిక్ గానే చెప్పిందీ ఈ ముంబై బ్యూటీ.ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాతోనూ మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది కృతి.

ఇప్పడు మరో హిట్ అందుకుని హ్యట్రిక్ భామగా ప్రూవ్ చేసుకోవాలని కృతి ఆశపడుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక అందులో ఒకటి సుధీర్ బాబు సరసన నటిస్తోన్న `ఆ అమ్మాయి గురించి మీకు ఒకటి చెప్పాలి` అనే సినిమా ప్రస్తుతం ఆన్ సెట్స్ లు ఉంది. ఇక ఇందులోనూ సుధీర్ బాబుతో రొమాంటిక్ సీన్స్ లో కృతి హద్దులు మీరిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లతో ఆ హింట్ ని కూడా పబ్లిక్ కి అందేసింది.ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కాబట్టి సీన్లు నాటకీయంగా ఉండొచ్చు.అలాగే `బంగార్రాజు` సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంటుందని తెలుస్తోంది.ఇంకా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా తెలుగు ఇంకా తమిళ్ లో తెరకెక్కనుంది.అలాగే యూత్ స్టార్ నితిన్ సరసన `మాచర్ల నియోజక వర్గం`లోనూ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: