నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రతినాయకుడు పాత్రలో శ్రీకాంత్ నటించాడు అలాగే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో పూర్ణ నటించింది.  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది వరకే సింహా, లెజెండ్ లాటి మాస్ బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో అఖండ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 2వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సినిమా వంద కోట్లకు పైగా గ్రేస్ ను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు ఇతర సినిమాల నుండి పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లలో మంచి కలెక్షన్ లతో ముందుకు సాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అఖండ సినిమా రిలీజ్ అయ్యి జనవరి 20 వ తేదీకి యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా 50 రోజుల వేడుక ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజుల్లో సినిమా 50 రోజులు ఆడడం అంటే చాలా కష్టం, అలాంటి ఈ రోజుల్లో 50 రోజులు అఖండ సినిమా ఆడినందుకు ఈ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించబోతునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే  అఖండ 50 రోజుల వేడుకకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన నిలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: