అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు, హావభావాలు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ దక్కింది. అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇందులోభాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈ మధ్య థియేటర్ లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన మరో సినిమా బంగార్రాజు కూడా ఈ సంక్రాంతి కి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలతో పాటు సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో, రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో, నితిన్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ లో మోస్ట్ బీసీయెస్ట్ హీరోయిన్ గా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి మాట్లాడుతూ అనేక విషయాలను తెలియజేసింది. శ్యామ్ సింగ రాయ్' సినిమా కథ విన్నప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కలిగింది. నాని గారి మాటల వలన ఆ నమ్మకం మరింత పెరిగింది అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయమంటూ ఉంటుంది .. అలా మీరు దేనికి భయపడతారు? ఏ విషయమై భయపడుతుంటారు? అనే ప్రశ్న ముద్దుగుమ్మ కృతి శెట్టి కి ఎదురైంది. ఈ ప్రశ్నకు కృతి శెట్టి స్పందిస్తూ.. మొదటి నుండి కూడా కింద పడతాను ఏమో అని భయం నాకు ఉంది. అందుకే నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ ఉంటాను. అందరు కూడా నన్ను నడక విషయంలో టీజ్ చేస్తూ ఉంటారు. చిన్న వయస్సు లో నేను పడిపోవడం వల్లనేమో ఆ భయం అప్పటి నుంచి అలా ఉండిపోయింది అంటూ కృతి శెట్టి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: