బిగ్ బాస్ సీజన్ 5 రెండు ప్రేమ జంటలను విడగొట్టిందా అంటే అవుననే అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ టాప్ 5గా నిలిచిన సిరి తో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. హౌజ్ లో ఉన్నప్పుడు వీరి హగ్గులు, ముద్దులు ఓ స్థాయి దాటాయి. హౌజ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హెచ్చరించినా సరే అవేమీ పట్టించుకోలేదు. ఆల్రెడీ బయట షణ్ముఖ్ తో దీప్తి సునైనా.. సిరితో శ్రీహాన్ లవ్ లో ఉన్నారు. సిరి అయిత్తే శ్రీహాన్ తో ఎంగేజ్ మెంట్ కూడా జరుపుకుంది.

బయట తమ కోసం ఓ ఇద్దరు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్, సిరి చేసిన అతి బయట ఉన్న దీప్తి, శ్రీహాన్ లను హర్ట్ చేసింది. అందుకే బిగ్ బాస్ పూర్తయ్యాక వీళ్లు కలుస్తారని అనుకోగా అది జరగలేదు. లేటెస్ట్ గా షణ్ముఖ్ తో తన రిలేషన్ ని బ్రేక్ చేస్తున్నానని దీప్తి పోస్ట్ పెట్టగా దాన్ని కన్ ఫర్మ్ చేస్తూ షణ్ముఖ్ కూడా మెసేజ్ చేశాడు.

ఇదిలాఉంటే వీరి జంట విడిపోవడానికి సిరి కారణమని అంటున్నారు. ఓ పక్క బిగ్ బాస్ పూర్తయ్యాక సిరి కూడా శ్రీహాన్ ని కలవలేదని తెలుస్తుంది. సిరి బర్త్ డే రోజు కూడా ఓ పోస్ట్ పెట్టి వదిలేశాడు తప్ప బిగ్ బాస్ అయ్యాక ఒక్కసారి కూడా వీళ్లు కలిసింది లేదు. ఇక ఇవాళో రేపో వీళ్లిద్దరు కూడా ఎవరి దారి వారు చూసుకుంటారని అంటున్నారు. బిగ్ బాస్ షో వల్ల రెండు ప్రేమ జంటలు విడిపోతున్నాయి. అయితే వాళ్ల మధ్య ప్రేమ నిజమైనదే అయితే ఈ కారణాల వల్ల విడిపోయే ఛాన్స్ లేదని సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: