సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా జనాల్లో ఎన్నో అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది.

కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల ను వాయిదా వేసి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కాకపోతే మహేష్ బాబు మోకాలికి చిన్న సర్జరీ కావడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే మహేష్ బాబు మోకాలి సర్జరీ అయిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకొని ఈ సినిమాను మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సర్జరీ నుండి త్వరగా కోరుకుంటూ ఉండడంతో జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా పూర్తవ్వగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: