దేశంలో కరోనా వైరస్ నుండి కొంత ఉపశమనం దొరికింది అనుకునే లోపే మళ్ళి కరోనా, ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక పలు  పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నారు. రాష్ట్రాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు..  కరోనా ఆంక్షలు సినిమాలను కూడా వాయిదా పడేలా చేస్తున్నాయి.

ఇక అందులో ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి మరి. అయితే ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కరోనా కారణంగా వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. దాంతో అభిమానులు నిరాశ భావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చే వార్త మరొక్కటి వినపడుతుంది. అదేంటంటే.. ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ 'రాధేశ్యాం' ని కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే జనవరి 14న రాధేశ్యాం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. దీన్ని మార్చి 18న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటనలో తెలుపలేదు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమాను పిరియాడిక్ లవ్ స్టోరీగా రాధేశ్యాంను డైరెక్టర్ రాధాక్రిష్ణ కుమార్ చిత్రీకరించారు. అయితే కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో ఇప్పటికే ట్రిపుల్ ఆర్, వాయిదా పడగా.. ఇప్పుడు రాధే శ్యాం వంతు వచ్చిందని నెటిజన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. అంతేకాదు.. కొన్ని రాష్ట్రాలలో థియేటర్లను బంద్ చేశారు. దీంతో కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపనుందని భవించినా సినీ నిర్మాతలు వాయిదా వేయడమే మంచిదని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: