టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు, ఆనందం సినిమాతో ఒక క్లాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ఆ తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ వంటి వరుస విజయాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆమధ్య బాక్సాఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొన్న శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. అయితే తాజాగా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటివరకు తెలుగులో క్లాస్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ తో ఒక సినిమా  చేయబోతున్నాడు.

ఈ సినిమాను శేఖర్ కమ్ముల పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించబోయే సినిమాలో  సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అని అనేక వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. దానికి ప్రధాన కారణం వరుసగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నటించడంతో ధనుష్ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శేఖర్ కమ్ముల, ధనుష్ హీరోగా తెరకెక్కించబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుంది అనే ఆలోచనకు దర్శకుడు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి దానిపై నిర్మించబోతున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: