చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా చేసిన సినిమాను చూసి పరవశంలో తేలిపోయారు చిరంజీవి. తన భర్త విష్ణుతో కలిసి సేనాపతి మూవీని సుస్మిత నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను చిరంజీవి చూసి చాలా మెచ్చుకున్నారట. ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి సినిమాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.. అంతేకాదు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి కూడా అడుగులు వేసింది. సుస్మితా కొణిదెల నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్ ను కూడా నిర్మించిన విషయం తెలిసిందే.


తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది సుస్మిత. మొదటి ప్రయత్నంలోనే షూటౌట్ ఎట్ ఆలేరు అని ఒక వెబ్ సిరీస్ నిర్మించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సుస్మిత. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5  ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీలో సినిమాలను నిర్మించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ సేనాపతి సినిమాను కూడా తన భర్త సహాయంతో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద నిర్మించింది.

ఇకపోతే ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాను చూసిన చిరంజీవి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించడం జరిగింది. సేనాపతి సినిమా చూశాను. పవన్ సాధినేని ఎంతో ఆసక్తికరంగా అనుక్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠతో చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మంచి అభివృద్ధికి అద్దంపట్టే ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు కొణిదెల సుస్మిత, విష్ణు ప్రసాద్ కు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో విడుదలైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించారు.. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: