నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది, ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ కనిపించనుండగా, మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతుంది.

 ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్టు గా, పోలీస్ ఆఫీసర్ గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చి దిదబోతునట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కామెడీ దర్శకుడు గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరో క్రేజీ డైరెక్టర్ ను కూడా బాలకృష్ణ లైన్ లో పెట్టినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ సంవత్సరం గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా కబడ్డీ నేపథ్యంలో సిటీ మార్ సినిమాను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంపత్ నంది దర్శకత్వంలో బాలకృష్ణ  నటించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: