నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఒక్కసారిగా జోరు పెంచేశారు. ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన అఖండ సినిమా లేటెస్ట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.దీంతో బాలయ్య ఇమేజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన బాల కృష్ణ వరసబెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నారు. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య మూవీ సంక్రాంతి పండుగ తరువాత సెట్స్ మీదకు వెళ్ళే అవకశాలు ఉన్నాయి.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ దసరా పండుగకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తారు అని తెలుస్తోంది. ఇక 2022 ద్వితీయార్ధంలో బాల కృష్ణ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఆరు నెలల్లో పూర్తి చేసుకుని 2023 సంక్రాంతి బరిలో దింపుతారు అని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ రెండు సినిమాల తరువాత బాల కృష్ణతో రచ్చతో సూపర్ హిట్ కొట్టి లేటెస్ట్ గా గోపీ చంద్ సిటీ మార్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ మూవీ వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు రానుంది. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో బాల కృష్ణ సినిమా ఉంటుంది అని సమాచారం తెలుస్తోంది.బాల కృష్ణ పూరీ కలయికలో వచ్చిన పైసా వసూల్ ఒక డిఫరెంట్ మూవీగా నిలిచింది. టోటల్ గా బాల కృష్ణ ఇమేజ్ ని బాడీ లాంగ్వేజ్ ని మార్చేసిన క్రెడిట్ ని పూరీ జగన్నాథ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా  ఇప్పటిదాకా రాలేదు. అయితే వచ్చే సంవత్సరం ఈ కాంబో సెట్స్ మీదకు వస్తుంది అంటున్నారు. ఈ విషయం మంచి క్లారిటీతో చెప్పే షో అన్ స్టాపబుల్ అంటున్నారు. విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాని తీస్తున్న పూరీ అన్ స్టాపబుల్ షోకి విజయ్ ని వెంటబెట్టుకుని మరీ వస్తున్నాడట.బాల కృష్ణతో తన సినిమాని అక్కడే పూరీ జగన్నాథ్ అనౌన్స్ చేస్తాడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: