మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, అందులో భాగంగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముఖ్యపాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇదిలా ఉంటే చిరంజీవి ఈ సినిమాతో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది.  అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి చిత్ర బృందం ఒక అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ను 40 రోజుల్లోనే పూర్తి చేయాలి అని చిత్ర బృందం ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 40 రోజుల్లోనే  స్టార్ హీరో సినిమా మరియు ఇంతమంది స్టార్ లలో తెరకెక్కుతున్న సినిమా పూర్తవుతుందా అని ప్రశ్న చాలామంది లో వ్యక్తం అవుతోంది. అయితే అనుకున్నది అనుకున్నట్లు చేసినట్లయితే కచ్చితంగా పూర్తి అవుతుందనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాడ్ ఫాదర్ సినిమాను ఒక ప్రణాళికతో అతి తక్కువ కాలంలో చిత్రీకరించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి 'బోలా శంకర్' ,  బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో చిరంజీవి నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: