ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమా క్రీడా రాజకీయ ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రలనే సినిమాలుగా మలచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో తెరకెక్కిన ఎన్నో బయోపిక్ లకు అటు ప్రేక్షకుల నుంచి కూడా విపరీతమైన ఆదరణ రావడంతోఎంతోమంది దర్శకు నిర్మాతలు  బయోపిక్ లను తెరకెక్కించి లాభాలను పొందాలి అని భావిస్తూ ఉంటారు. అదే సమయంలో బయోపిక్ తెరకెక్కించాలని అంటే కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. ఆయా ప్రముఖులకు సంబంధించిన జీవిత కథలో కాస్త సినిమాటిక్ మార్పులు చేస్తే సరిపోతు ఉండటంతో దర్శక నిర్మాతలు అందరూ చూపు బయోపిక్ ల పైనే ఉంది అని చెప్పాలి.


 అయితే క్రీడా రంగానికి సంబంధించిన ఎంతో మంది ప్రముఖుల బయోపిక్ లు ఇప్పటికే తెరకెక్కాయి. మహేంద్రసింగ్ ధోని బయో పిక్ తెరకెక్కి ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఇక ఇటీవలే 1983లో వరల్డ్ కప్కు సంబంధించి ఒక బయోపిక్ 83 పేరుతో ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు క్రికెట్ కు సంబంధించి మరో బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించబోతున్నారు. ఇక ఇందులో ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది.


 ఈ సినిమాకి చెక్ ద ఎక్స్ప్రెస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఇక ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ విషయాన్ని ఇటీవలే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు ప్రధాన బౌలర్గా నే కాకుండా ఎన్నో రకాలుగా సేవలు అందించారు ఝాలన్ గోస్వామి. టీమిండియా కెప్టెన్గా కూడా పని చేశారు.  క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.  ఎన్ని కష్టనష్టాలను తట్టుకొని వచ్చారు అన్న కథాంశం తో నే వాస్తవిక పరిస్థితులు ఆధారంగానే ఈ సినిమా రూపొందినట్లు అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు ప్రసిత్ రాయి దర్శకత్వం వహించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: