'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ''సర్కారు వారి పాట''.'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పెట్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ ఇంకా SVP బ్లాస్టర్ టీజర్ మంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి.ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.ఇక ''సర్కారు వారి పాట'' సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నాలుగు నెలలు నుంచి ఎలాంటి కొత్త అప్డేట్ లేకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్న అభిమానులు .. ఫస్ట్ సింగిల్ విడుదల చేయమని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి రిక్వెస్ట్ పెడుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నుంచి ఈ సినిమా అప్డేట్స్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు.ఇక థమన్ కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ గా నిలవడం ఖాయమట. అంతలా ఈ సినిమాకి సంగీతం ఇచ్చాడట థమన్. ఇక 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ రెడీ చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్న విధంగా సరికొత్తగా చాలా కనిపించబోతున్నారనే ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ సినిమాలో సముద్ర ఖని,ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్  ఇంకా సుబ్బరాజు అలాగే ఇతర నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఫ్యాన్స్ ని మెప్పించడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: