నాచురల్ బ్యూటీ సాయి పల్లవి వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా సాయి పల్లవి లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్  సినిమాలతో మంచి హిట్లను సొంతం చేసుకుంది. ఇక శేఖర్ కమ్ముల సాయి పల్లవితో మరోమారు మ్యాజిక్ చేశారు.  అప్పుడు ఫిదా సినిమాలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... అనే పాట మంచి గుర్తింపును సొంతం అలాగే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట అంతకు మించిన సంచలనాలు నమోదు చేశారు. అయితే తాజాగా సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ్ రాయ్  డిసెంబర్ 24 విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి.

అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది సాయిపల్లవి. సక్సెస్ మీట్ లో భాగంగా సాయిపల్లవి అనేక ఇంటర్వ్యూ ల లో పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్  సాయి పల్లవి ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా దానికి సాయి పల్లవి నాకు వయసు కేవలం 29 సంవత్సరాలే... 30 ఏళ్ల తర్వాత దీని గురించి ఆలోచిస్తా.... ప్రస్తుతం అయితే ఏలాంటి పెళ్లి ఆలోచనలు లేవు అని సాయి పల్లవి క్లియర్ గా చెప్పింది. అయితే ఈ జనరేషన్ లో సాయి పల్లవిని పద్దతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు. అయితే సాయి పల్లవి తనకంటూ కొన్ని నియమాలు, నిబద్ధతలు పెట్టుకున్న ఆమె వాటిని ఫాలో అవుతారట.

ఇక సినిమాల విషయంలో సాయి పల్లవి రెమ్యునరేషన్ కి ఆశపడి తనకి నచ్చని పాత్రలు చేయదట.ఇక స్కిన్ షోకి, బోల్డ్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉంటారు ఈమె. ఇక ప్రస్తుతం సాయిపల్లవి రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రానా ప్రేయసిగా ప్రేక్షకులకు కనబడనుంది. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి మరో తమిళ సినిమాలో కూడా నటిస్తుంది. పోతే తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఈమె  నటించిన ఈ తమిళ చిత్రం ''చిత్తిరై సవ్వానమ్'' ఓటిటిలో విడుదలైంది. ఇకపోతే సాయి పల్లవి తన చెల్లెల్ని అందరూ  ఆదరించాలని తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: