మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది  అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్చరణ్కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్ లుగా కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే తెలియజేసింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.  చిరంజీవి ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త లపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: