ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ స్టోరీలు తీస్తున్నాయి. బయోపిక్ సినిమాలపై మొదట్లో కొంచెం కన్‌ఫ్యూజ్ ఉన్నా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ కొట్టడంతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెరిగింది. వాస్తవాలకు దగ్గరగా.. ప్రేక్షకులనే ఆకట్టుకునే సెంటిమెంట్, లవ్‌ను మంచిగా ప్రజెంట్ చేసినట్లయితే సినిమా సక్సెస్ అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖుల జీవిత కథలు వెండితెరపై అలరించాయి. మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో రెండు బయోపిక్ చిత్రాలకు రంగం సిద్ధం చేస్తోంది. వీటికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ  రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ప్రస్తుతం ఒక బయోపిక్‌లో నటిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్లెట్ జులన్ గోస్వామి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘చక్ దా ఎక్స్ ప్రెస్’. ఇందులో అనుష్క శర్మ జులన్ గోస్వామిగా నటించనున్నారు. ఈ సినిమా టీజర్‌ను అనుష్క శర్మ గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంది. ‘చక్ దే ఎక్స్ ప్రెస్’ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి లైఫ్ స్టోరీ. ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టిన క్షణాలు.. మహిళలు క్రికెట్ గురించి ఆలోచించడానికి కూడా కష్టమవుతున్న పరిస్థితులు.. అలాంటి సమయంలో క్రికెటర్‌గా ఎలా రాణించింది అనే విషయంపై సినిమా తీస్తున్నామన్నారు. దర్శకుడు ప్రొసిత్ రాయ్ డైరెక్ట్ చేస్తుండగా.. కర్నేష్ శర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథలో తాప్పి నటిస్తోంది.


మచిలీపట్నంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా. ఇతని బయోపిక్‌ను బాలీవుడ్‌లో ఒక సినిమా తీస్తున్నారు. తుషార్ హీరానందని డైరెక్షన్‌లోకృష్ణన్ కుమార్, భూషన్ కుమార్, నిధి పర్మన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్‌ను సెలెక్ట్ చేశారు. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్.. తన లోపం తనకి శాపం కాదని ప్రపంచానికి నిరూపించాడు. కాగా ఈ సినిమాకు ‘శ్రీకాంత్ బొల్లా’ టైటిల్ ఖరారు చేయగా.. జూలై నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: