‘పుష్ప’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా విమర్శకుల నుండి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఆమూవీ 300కోట్ల క్లబ్ లో చేరే విధంగా పరుగులు తీస్తోంది.’ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ లు వాయిదా పడటంతో ఈ మూవీ హవా సంక్రాంతి వెళ్ళేవరకు కొనసాగే ఆస్కారం ఉంది అంటున్నారు.


ఈ ఘన విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ ‘పుష్ప’ టీమ్ ఈమధ్య ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ఒక ఘనమైన పార్టీని పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీకి సుకుమార్ ఆలు అర్జున్ సునీల్ రష్మిక అనసూయ తమ కుటుంబ సభ్యులతో ఈ పార్టీకి రావడమే కాకుండా ఈ పార్టీని తెగ ఎంజాయ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ పార్టీలో అనేక సరదా విషయాలతో పాటు దేవీశ్రీ ప్రసాద్ పెళ్ళి పై ఈమధ్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి నేరుగా దేవిశ్రీ నే అడిగి క్లారిటీ తీసుకున్నట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తో చనువుగా ఉండటమే కాకుండా ఆమెను ప్రేమిస్తున్నాడని త్వరలో వీరిద్దరి పెళ్ళి జరగడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


దేవిశ్రీకి ఇప్పటికే 40 సంవత్సరాలు దాటిపోవడంతో అతడి పెళ్ళి గురించి అతడి కుటుంబ సభ్యుల నుండి కూడ ఒత్తిడి వస్తోంది అంటూ అనేక ఊహాగానాలు చేస్తోంది. దీనితో ఈవిషయమై సుకుమార్ బన్నీలు దేవిశ్రీని అడిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి దేవిశ్రీ వారికి ఏమి చెప్పాడో తెలియకపోయినా ‘పుష్ప’ పార్టీలో దేవిశ్రీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు అనడంలో సందేహంలేదు. ఇప్పటికే ‘పుష్ప’ మూవీలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఆ స్థాయికి మించి దేవిశ్రీ ‘పుష్ప 2’ లో పాటలు కంపోజ్ చేయవలసిన పరిస్థితి. కథ ఫైనల్ కావడంతో ఆ కధకు అనుగుణంగా పాటలు వ్రాయించి ట్యూన్ కట్టె పనిలో దేవిశ్రీ ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: