సాధార‌ణంగా క‌థ విన్న‌ప్పుడు ఫ్లాప్ అవుతుంద‌నిపిస్తే ఏ హీరో సినిమా చేయ‌డానికి ముందుకు రాడు. కానీ, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాత్రం ఫ్లాప్ అవుతుంద‌ని తెలిసి కూడా ఓ సినిమా చేశాడు. అదేదో కాదు `బ్రహ్మోత్సవం`. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టించారు.

జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై  పొట్లూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ 2016 మే 20న విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి రోజే నెగ‌టివ్ టాక్ తెచ్చుకుని డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్ లోనూ తెర పట్టనంత మంది జనం, భారీ సెట్టింగ్ లు ఉంటాయి త‌ప్పా.. సినిమాలో క‌థ మాత్రం ఏమీ ఉండ‌దు. దీంతో ఈ చిత్రంపై మ‌హేష్ బాబు ఫ్యాన్స్ సైతం పెద‌వి విరిచారు.

ఇక‌పోతే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమా తీసి శ్రీ‌కాంత్ అడ్డాల అటు వెంక‌టేష్‌కు, ఇటు మ‌హేష్‌కు మంచి హిట్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత శ్రీకాంత్ అడ్డాల.. ఒక ఫ్యామిలీ కథ ఉంది, అది కూడా సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు స్టోరీ లా ఉంటుంది అని చెప్పడంతో, మహేష్ పూర్తి కథ వినకుండానే బ్రహ్మోత్సవంకు ఓకే చెప్పేశాడ‌ట‌.

షూటింగ్ స‌గం అయ్యాక మ‌హేష్ పూర్తి క‌థ‌ను తెలుసుకున్నాడ‌ట‌. అప్పుడే సినిమా ఖ‌చ్చితంగా ఫ్లాప్ అవుతుంద‌ని మ‌హేష్ బాబుకు అర్థ‌మైపోయింద‌ట‌. అంతే కాదు, సినిమా పూర్తి క‌థ విన్నాక శ్రీకాంత్ అడ్డాల పై తీవ్రంగా ఫైర్ అయ్యి సెట్ నుంచి వెళ్ళిపోయాడట. అయితే షూటింగ్ చాలా వ‌ర‌కు అయిపోవ‌డంతో మ‌హేష్ సినిమాను మ‌ధ్య‌లోనే ఆప‌లేక ఎలాగోలా ఫినిష్ చేశాడ‌ట‌. ఇక చివ‌ర‌కు మ‌హేష్ ఊహించిన‌ట్టే గ్రాండ్‌గా విడుద‌లైన బ్రహ్మోత్సవం సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డి నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ నేప‌థ్యంలోనే బ్రహ్మోత్సవం త‌ర్వాత క‌థల‌ ఎంపిక‌లో మ‌హేష్ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం అల‌వాటు చేసుకున్నాడ‌ని టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: