అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు దక్కడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు రాశి కన్నా, గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్  సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రాశి కన్నా ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాశి కన్నా హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో  సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ హీరోయిన్‏గా నటిస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ ని ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. తాజాగా రాశి కన్నా యోధ సెట్స్ లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాశి ఖన్నా తెలియజేసింది. ఇంత సాదర స్వాగతం పలికినందుకు సినిమా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. యోధ’ సెట్లో మొదటి రోజు అంటే రాశి కన్నా రాసుకొచ్చింది . ఇలా హాట్ బ్యూటీ రాశి కన్నా యోధ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: