శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు, వివాదాలతో, విమర్శలతో బాగా పాపులర్ అయిన నటి. ఈమె పేరు వింటే చాలు ఇండస్ట్రీలో పలువురు కోపంతో ఊగిపోతారు. ఎందుకన్నది అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల వ్యక్తిత్వంపై శ్రీ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ను వీడి ఈమె చెన్నైలో ఉంటున్నారు. అయితే ప్లేస్ ఏదైనా టాలీవుడ్ పై రాళ్ళు విసరడం మాత్రం అస్సలు మరచిపోవడం లేదు ఈ చిన్నది. కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్స్ గా అడిగిన దానికి అడగని విషయానికి విశ్లేషిస్తూ విమర్శల పాలవుతోంది. అయితే ఈమెకు మద్దతు పలికేవారు లేకపోలేదు.

ఇండస్ట్రీలో ఆమె పడ్డ కష్టానికి ఆమె మనసు రాటుతేలిందని  నిజాలు చెబితే అందరికీ చేదని ఆమెకు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. ఎంతో మంది తలవంచుకుని వెళుతుంటే శ్రీ రెడ్డి దైర్యంగ నిజాన్ని నిర్భయంగా బట్ట బయలు చేసింది అని దుమ్ముదులిపేసిందని మెచ్చుకునేవారు లేకపోలేదు. శ్రీ రెడ్డి అచ్చ తెలుగమ్మాయి ఈమెది విజయవాడ. ఈమే అసలు పేరు విమల. బీటెక్ పూర్తి చేసుకుని విజయవాడ నుండి భాగ్యనగరం బాట పట్టింది. సాక్షి టివి ద్వారా కెమెరా ముందుకు యాంకర్ గా వచ్చిన ఈమె ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసి కనుమరుగైపోయింది. ఈమె మొదట హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేను నాన్న అబద్దం' ఇందులో గీతామాధురి భర్త నందు హీరోగా చేశారు.

హఠాత్తుగా కొన్నేళ్ల తర్వాత కట్ చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెను వివాదం అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలలో రచ్చ అన్నిటినీ బట్టబయలు చేస్తూ ఇండస్ట్రీపై విమర్శలు కురిపించింది శ్రీ రెడ్డి. తెలుగు వారికి ఇక్కడ అవకాశాలు దక్కవని ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి అని అడిగిన ప్రతి వాడి కోరికని తీర్చాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎదురు చూసే క్షణం లేదని మూటముళ్ళు సర్దుకున్నాకే అసలు ఇండస్ట్రీలో ఏం రాజకీయాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలనే నిర్ణయించుకున్నాను అని మూడేళ్ల క్రితం ప్రకటించింది. ఇక అప్పటి నుండి వరుసగా పలువురు హీరోలపై , సినీ ప్రముఖుల పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: