ఇస్మార్ట్ బ్యూటీ ప్రేమలో పడ్డదా.. త్వరలో హీరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్న హీరోయిన్ నిధి అగర్వాల్ తమిళ స్టార్ హీరోని ప్రేమిస్తుందా.. ఈ ఇద్దరు కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తమిళ ఇండస్ట్రీ వర్గాలు. కోలీవుడ్ స్టార్ శింబు తో నిధి అగర్వాల్ లవ్ ట్రాక్ నడిపిస్తుందని తెలుస్తుంది. ఇద్దరు కలిసి ఈశ్వరన్ సినిమా లో నటించారు. రెండేళ్లు ఈ సినిమా కోసం కలిసి పనిచేయడంతో నిధి, శింబు ప్రేమలో పడ్డారని టాక్.

శింబు ఇదివరకు నయనతార, హాన్సిక, త్రిష లాంటి హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపించాడు. అయితే ఇవేవి సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీలు కాలేకపోయాయి. ఇక ఇప్పుడు కొత్తగా నిధి అగర్వాల్ తో శింబు ప్రేమ కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇద్దరు పెళ్లికి ఓకే అనుకుని కెరియర్ మీద దృష్టి పెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అంటున్నారు. ఒకప్పుడు కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న శింబు ఇప్పుడు అక్కడ ఫాం కోల్పోయాడు.

అయితే రీసెంట్ గా వచ్చిన మానాడు సినిమా తో మాస్ హిట్ అందుకున్నాడు శింబు. శింబు, నిధి అగర్వాల్ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్తుంది. అసలు వీరి మధ్య ఉంది ప్రేమేనా కాదా.. వీళ్లిద్దరి పై వస్తున్న వార్తలపై ఎవరు ముందు స్పందిస్తారు లాంటి విషయాలపై త్వరలో క్లారిటీ వస్తుంది. శింబు మాత్రం ఇక మీదట కెరియర్ మీద పూర్తి ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే రెండు కథలు ఫైనల్ చేసినట్టు టాక్. త్వరలోనే వాటికి సంబందించిన అఫీషియల్ న్యూస్ వస్తుందని చెబుతున్నారు. శింబు మాత్రం ఇక మీదట కెరియర్ మీద పూర్తి ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే రెండు కథలు ఫైనల్ చేసినట్టు టాక్. త్వరలోనే వాటికి సంబందించిన అఫీషియల్ న్యూస్ వస్తుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: