ఎవర్ గ్రీన్ ప్రేమికుడు శింబు ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు హోరెత్తుతున్నాయి. అందులోనూ అది సాదా సీదా ప్రేమ కాదట కుటుంబ సభ్యులకు సైతం ఆ హీరోయిన్ ను పరిచయం చేసి పెళ్లికి రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులు కూడా ఒప్పుకున్నారని అతి త్వరలోనే శింబు ఇంట్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి అని తెలుస్తోంది. అసలు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అన్న వివరాలు చూస్తే...

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిది అగర్వాల్. ఈ అమ్మడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అయితే శింబుతో కూడా 'ఈశ్వరన్' సినిమాలో కలిసి నటించింది నిది. ఇక ఆ సమయంలోనే శింబుతో పీకల్లోతు ప్రేమలో పడిందని అంటున్నారు. అంతేకాదు అప్పటి నుండి వీరు డేటింగ్ లో ఉన్నారని రెండేళ్ల నుండి ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని కోలీవుడ్ మీడియాలలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇద్దరికీ మధ్య సఖ్యత బాగా కుదరడంతో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శింబు లేక నిది అగర్వాల్ స్పందిస్తే తప్ప  క్లారిటీ రాదు. ఇక గతం లో స్టార్ హీరోయిన్లతో శింబు ప్రేమాయణాలు గురించి అలాగే బ్రేకప్ ల గురించి అందరికీ తెలిసిందే. ఈ లిస్ట్ లో టాప్ హీరోయిన్ లు అయిన త్రిష, నయనతారమరియు హన్సికలు ఉన్నారు. కానీ అన్నీ ఫెయిల్ అయినా ప్రేమ కథలే... ఇప్పుడు నిధి అగర్వాల్ అయినా సక్సెస్ అవుతుందా లేదా వీరి లిస్ట్ లోనే చేరుతుందా అని నెటిజన్లు కాచుకు కూర్చున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: