సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న డైరక్టర్ పరశురాం మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా సినిమా ఉంటుందని బలంగా చెబుతున్నాడు. సినిమా షూటింగ్ కి కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పరశురాం లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. సర్కారు వారి పాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అన్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడిని కొత్త యాంగిల్ లో చూస్తారని అంటున్నాడు పరశురాం.

అంతేకాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి చెబుతూ అతని దగ్గర ఉన్న ఓ మల్టీ స్టారర్ కథ ఉందని అందులో ముగ్గురు హీరోలు నటించాల్సి ఉంటుందని అన్నారు పరశురాం. మాములుగా ఇద్దరు హీరోలు ఉంటేనే బాక్సాఫీస్ షేక్ ఆడించే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ముగ్గురు హీరో లతో పరశురాం మల్టీస్టారర్ అంటే మాములు విషయం కాదు. తప్పకుండా సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత పరశురాం ఈ మల్టీ స్టారర్ కథ మీదే వర్క్ చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతానికి లైన్ మాత్రమే ఉందని హీరోలు ఫైనల్ అయితే ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని చెబుతున్నారు పరశురాం.

ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, యువత, శ్రీరస్తు శ్య్భమస్తు, గీతా గోవిందం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పరశురాం కెరియర్ లో ఫస్ట్ టైం స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనుకున్న విధంగా ఉంటే మాత్రం తప్పకుండా పరశురాం కూడా టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చెరుతాడని చెప్పొచ్చు. అయితే ఆయన అసలు ఈ కథలో ఎవరెవరిని హీరోగా అనుకుంటున్నాడు.. ఏయే కాంబినేషన్ సెట్ చేయాలని అనుకుంటున్నాడు అన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా నడుస్తుండగా పరశురాం ముగ్గురు స్టార్స్ ని ఒప్పిస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: