హీరోయిన్స్ ఫోటోలు నిరంతరం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతాయి. ఇప్పడు ఇంకా ఇంటర్నెట్ ట్రెండ్ పెరిగింది కనుక ఫ్యాన్ పేజస్ మెయింటైన్చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాడు దిగిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండిస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. అందం మరియు అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను ఆమె కొల్లగొట్టింది. దాదాపు తెలుగు, తమిళ్ మరియు మలయాళం ఇండస్ట్రీలలో స్టార్ హీరోలు అందరి సరసన ఆమె నటించింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ కావాలి అంటే ముందు ఈమె పేరునే అందరూ సజిస్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ ఈమె మారింది ఇంకా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా ఇంకా అయితే నేనే చెప్పేస్తా చూడండి.

ఈ ఫోటీలో కనిపిస్తున్న పాపాయి చెన్నై చంద్రం అయిన త్రిష కృష్ణన్. 1983 మే 4న మద్రాసులో జన్మించింది త్రిష. 1999 సంవత్సరం నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ మూవీతో టాలీవుడ్‌కు ఆమె పరిచయమైంది. వర్షం సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు ఓ రేంజ్‌లో వచ్చాయట.తెలుగులో దాదాపు స్టార్స్ అందరితో కలిసి నటించింది త్రిష. ఇటు కుర్ర హీరోలు అటు వెటరన్ స్టార్స్‌ అయిన చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారితో రొమాన్స్ చేసి రెండు తరాల హీరోయిన్‌గా ఆమె సత్తా చాటింది.


అలాగే తమిళ్‌లోనూ పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోలతో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. 96 సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకుంది ఈ చిన్నది.ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలలోనే నటిస్తుంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా వదులుకుంది. ప్రస్తుతం త్రిష నటించిన 4 తమిళ్ సినిమాలు మరియు 1 మలయాళ సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: