రెండు కాలేజీలలో ఇంజినీరింగ్ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్నేహితుల మద్య గొడవలు.. ప్రేమ, అల్లర్లు అన్ని అంశాలు ఈ మూవీ ఉండనున్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులందరికీ ముందస్తుంగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. నాకు నోస్టాలజిక్ డే అని, ముఖ్యంగా ఆది సినిమా సమయంలో దిల్రాజుతో, శిరీష్తో అసోసియేషన్ ఏర్పడింది. మా శిరీష్ అన్న కొడుకు, సోదర సమానుడు ఆశీష్తో అప్పటివరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీబాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
తన సినిమా ట్రైలర్ను నేను విడుదల చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాజుగారితో, శిరీష్గారితో ఉన్న జర్నీని గుర్తు చేసుకున్నట్టు అయిందని పేర్కొన్నారు. రౌడీబాయ్స్ ట్రైలర్ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్కు డైరెక్టర్ శ్రీహర్షకు అభినందనలు. ముఖ్యంగా ఆశిష్ గురించి మాట్లాడినట్టయితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి చిత్రాల్లో తను భాగం కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
రౌడీబాయ్స్ సినిమా ఘన విజయం సాధించాలని కోవిడ్ సమయంలో విడుదలవుతున్న రౌడీబాయ్స్ మంచి చిత్రంగా మనకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రేమదేశం చూసిన ఎగ్జయిట్మెంట్ వచ్చింది. నాకే కాకు మీ అందరికీ కూడా అలాంటి ఎగ్జయిట్మెంట్ కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. వైవిధ్యమైన సినిమాలను, మంచి సినిమాలను ఆదరించే మన తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తారనే నమ్మకముంది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. సినిమాను థియేటర్లలో చూసి సినిమాకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఎన్టీఆర్. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కళాశాలలో నేపథ్యంలో సాగే లవ్ ఎంటర్ టైన్ చిత్రంగా కనిపిస్తుంది. అదేవిధంగా రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ సీన్లు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమాను లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది. పలువురు నెటిజన్లు అదుర్స్ అని కామెంట్లు కూడా చేస్తున్నారు. సినిమా ఏవిధంగా ఉంటుందో చూడాలి మరీ.