సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట రిలీజ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ స్టార్, ఆ తరువాత కరోనా కారణంగా కొన్నాళ్లపాటు సర్కారు వారి పాట షూట్ మొదలెట్టలేదు. ఇక కొన్ని నెలల అనంతరం మొదలైన ఈ మూవీ షూట్ ఇటీవల చాలా వరకు పూర్తి చేసుకుంది.

అయితే కొద్దిరోజుల క్రితం మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేష్ బాబు, అనంతరం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో రెస్ట్ తీసుకుని ఐదు రోజుల క్రితం హైదరాబాద్ తిరిగి వచ్చారు. అయితే సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ అతి త్వరలో మొదలుకాబోతోంది అనుకున్న సమయంలో సడన్ గా మహేష్ కి కరోనా పాజిటివ్ రావడంతో మరికొన్నాళ్లు పాటు షూట్ కి బ్రేకులు పడ్డాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మది కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ గా చేస్తున్నట్లు టాక్.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ మూవీని మొదట కేవలం తెలుగులోనే రిలీజ్ చేద్దాం అని భావించిన యూనిట్, లేటెస్ట్ గా దీనిని పాన్ ఇండియా మూవీగా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల చేసేలా ఆలోచన చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా స్టోరీ పాయింట్ అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఇన్నర్ వర్గాల టాక్. పరశురామ్ పెట్ల ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు సూపర్బ్ గా ఉండనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా సర్కారు వారి పాట కనుక పాన్ ఇండియా మూవీగా కనుక రిలీజ్ అయితే మహేష్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగే అని చెప్పాలి. కాగా ఈ మూవీని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: