సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పోకిరి లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. బ్యాంక్ స్కాం ల కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలకు స్పేస్ ఇచ్చేందుకు సర్కారు వారి పాట సైడ్ అయ్యింది. ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ 1న కూడా వచ్చే ఛాన్స్ లేదని అర్ధమవుతుంది. సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ లో కూడా రిలీజ్ కష్టమే అని అంటున్నారు.

మహేష్ కి మోకాలి సర్జరీ వల్ల ప్రస్తుతం జరగాల్సిన షెడ్యూల్ వాయిదా పడ్డది. అదీగాక ఇండస్ట్రీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న వేల సినిమాల షూటింగ్ జరపడం కష్టమే అనేలా ఉంది. ఎన్నో జాగ్రత్తలతో తక్కువ క్రూతో సినిమా షూటింగ్ జరపాల్సి ఉంది. లేటెస్ట్ గా మహేష్ సోదరుడు రమేష్ బాబు మృతి వల్ల మహేష్ చాలా బాధలో ఉన్నారు. ఇవన్ని ఇప్పుడప్పుడే ఆయన్ని షూటింగ్ గ్యాప్ ఇచ్చేలా చేస్తున్నాయి. అందుకే మహేష్ సర్కారు వారి పాట కూడా ఏప్రిల్ 1న రావడం కష్టమే అని అంటున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ వల్ల సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. మరి సర్కారు వారి పాట అనుకున్న టైం కు వస్తుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: