‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోవడంతో టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు అంతా పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈపాటికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై దేశవ్యాప్తంగా చాలామంది చరణ్ జూనియర్ ల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు.



అయితే చరణ్ జూనియర్ ల కల నెరవేరకుండానే అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కల నెరవేరిపోయింది. గతనెల విడుదలైన ‘పుష్ప’ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఆమూవీ యూనిట్ బాలీవుడ్ లో పెద్దగా ప్రమోట్ చేయకపోయినా ఆమూవీకి 30 కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది.




ఇలాంటి పరిస్థితులలో కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ ను కలిసి తాము త్వరాలో మొదలుపెట్టబోతున్న కొన్ని మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్ లో బన్నీని నటించమని అడిగినట్లు టాక్. పేరుకు అది మల్టీ స్టారర్ అయినప్పటికీ తన పాత్ర కొంతవరకు సెకండ్ హీరో రేంజ్ లో ఉంటుంది కాబట్టి తాను అలాంటి పాత్రలు చేయనని కేవలం సోలో హీరో పాత్రలను మాత్రమే చేస్తానని బన్నీ సున్నితంగా బాలీవుడ్ నిర్మాతలకు చెప్పి తప్పించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


దీనితో అల్లు అర్జున్ కు అప్పుడే అంత ఇగోనా అంటూ ఈమధ్య బన్నీని కలిసిన కొందరు బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంచి కథ మంచి దర్శకుడు దొరికితే తాను మరిన్ని పాన్ ఇండియా మూవీలు చేస్తానని బన్నీ చెప్పినప్పటికీ అప్పుడే ఖంగారు పడి వరసపెట్టి బాలీవుడ్ సినిమాలను ఒప్పుకునే ఉద్దేశం అల్లు అర్జున్ కు లేదు అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం అతడి దృష్టి అంతా ‘పుష్ప 2’ పై ఉండటంతో ఆమూవీ పూర్తి అయి విడుదల అయ్యేవరకు బాలీవుడ్ సినిమాల విషయంలో ఖంగారు పడకూడదని అల్లు అర్జున్ స్థిర నిర్ణయంతో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: