ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ లో మల్టీస్టారర్ సినిమాలకు కొదవ లేకుండా పోయింది. ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమా వస్తే బాగుండు అని ఎంతో నిరీక్షణ ఎదురుచూసేవారు తెలుగు ప్రేక్షకులు. ఎప్పుడో గాని మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కావు.  కానీ ఇప్పుడు మాత్రం ఎన్నోమల్టీస్టారర్ సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల నటిస్తే అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా ముగ్గురు హీరోలు నటిస్తే ఆ సినిమా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఫీల్గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు పరశురామ్ ఇలాంటి సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన గీత గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో 100 కోట్ల మార్కును అందుకున్న దర్శకుడిగా మారిపోయాడు పరశురాం. ఇక ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే చాన్స్ కొట్టేసాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ క్రమంలోనే ముగ్గురు హీరోలతో దర్శకుడు పరశురామ్  మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది.



 ఏకంగా ముగ్గురు హీరోలతో ప్లాన్ చేస్తున్న మల్టీ స్టారర్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని  అనుకుంటున్నాడట దర్శకుడు పరశురామ్. ఇక దీనికి సంబంధించిన ఈ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూ ఉండగా అందరు హీరోల అభిమానులు ఈ వార్త ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఈ వార్త ఎంతవరకూ నిజమన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్థుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా పరశురాం ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: