పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనకు తెలిసిన విషయమే. మొహమాటమే లేకుండా ఫేస్ మీదనే మాట్లాడే క్యారెక్టర్ గల అమ్మాయి. సినిమా సినిమా కి వేరియేషన్స్ ఉన్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ ..తనలోని కొత్త టాలెంట్ ను అభిమానులకు చూయిస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్యనే తనకు కాబో భర్త గురించి అధికారికంగా ప్రకటించింది. దీంతో కొంతమంది అభిమానులు షాక్ అవ్వగా ..ఇంకొంతమంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్ గా రకుల్ కూడా పెళ్లి చేసుకోబోతుంది అని అనుకుంటున్న టైంలో అమ్మడు మరో బిగ్ బాంబ్ పేల్చింది.

తనకు సంబంధించిన  విషయాలను అభిమానులతో పంచుకోవాలనే జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నాను అని చెప్పానని..పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోను అని కరాఖండీగా చెప్పేసింది. తాను ఇంకా లైఫ్ లో సాధించాల్సినవి చాలా ఉన్నాయని..నా కలలు ఫుల్ ఫిల్ అయ్యాకనే   నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక దీంతో వీళ్లు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డాయి. సోషల్ మీడియాలో కొత్త రూమర్లు  చక్కర్లు కొడుతున్నాయి. అది ఏమిటంటే గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట కొద్ది రోజుల క్రితమే  రహస్యంగా పెళ్లి చేసుకున్నారని..అంతేకాదు ఒక్కే ఇంట్లో కలిసి  ఉంటున్నారని గత కొద్ది రోజులుగా నెట్టింట్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో  తనపై వస్తున్న రూమర్స్ పై ఘాటుగా స్పందించింది రకుల్.

అలాంటి పుకార్లను నమ్మకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ మాట్లాడుతూ.." నా అభిమానులకు నా జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయం చెప్తా. మీకు చెప్పకుండా నేను ఏం చేయను. నా లైఫ్ కు సంబంధించిన గుడ్ న్యూస్ కాని బ్యాడ్ న్యూస్ కానీ మీకు తెలియజేస్తా. అంతేకానీ అనవసరంగా ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయకండి. నాకు ఇలాంటి ఫేక్ వార్తలు పై స్పందించే టైం లేదు. నేను నా కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ఉన్నా. నా చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. బహుశా అందుకే నా పై ఇలాంటి చెత్త రూమర్లు క్రియేట్  చేస్తున్నారేమో".. అంటూ తెలిపింది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: