ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా ఎక్కువ అవుతున్నాయి.. ప్రేక్షకులను అలరించడానికి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటూ మరింత ఆనందాన్ని పంచుతున్నారు. మాస్ మహారాజ గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఖిలాడీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు రావణాసుర అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..

ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ  సినిమా సెట్స్ పైకి రానుంది.. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయకముందే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే మరో సినిమా కూడా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు మహారాజా రవితేజ. ఇప్పుడు మరో వైపు స్వామిరారా సినిమా దర్శకుడు సుధీర్ వర్మ తో కలిసి రావణాసుర అనే  క్రేజీ థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగును కూడా మొదలు పెడుతున్నారు.. ఇక పూజా కార్యక్రమాలను ఈ సంక్రాంతికి నిర్వహించనున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు నిర్మాతలు గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామా వ్యవహరిస్తున్నారు.. అంతేకాదు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టడం గమనార్హం..

ఇకపోతే ఈ సినిమాలో దక్షా నగార్కర్ ను విలన్ పాత్రకు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ హీరోతో రవితేజ మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. తమిళ్ హీరో విష్ణు విశాల్ తో .. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఒక ఫోటో  బాగా వైరల్ అవుతుండగా ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ తెలియజేశారు. అయితే  విష్ణు విశాల్ హీరో రవితేజతో కలిసి రావణాసురా సినిమాలో నటిస్తున్నారా..?  లేక ఇంకో కొత్త సినిమా ఏదైనా చేయబోతున్నారా..? అనే విషయం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: