కరోనా వైరస్ మరొకసారి విస్తృతంగా పెరిగిపోతోందని చెప్పవచ్చు. గత మూడు సంవత్సరాల నుంచి ఇది పట్టి పీడిస్తూ వస్తోంది ప్రజలను. తాజాగా సెకండ్ వేవ్ తో ముగిసింది అనుకుంటే మరొకసారి థర్డ్ వేవ్ తో ముందుకు వస్తోంది.. అంతేకాకుండా ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ఎక్కువ సంఖ్యలో దీని బారిన పడటం జరుగుతోంది. ఈ సారి ఎక్కువగా సినీ సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడటం గమనార్హం. అటు టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ అని సినీ పరిశ్రమ తేడా లేకుండా అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా మరొక నటుడు కూడా ఈ వైరస్ బారిన పడడం జరిగింది వాటి విషయాలను చూద్దాం.

రెండు రోజుల క్రితం మంచు లక్ష్మి, మహేష్ బాబు, సత్యరాజ్ వంటి వారే కాకుండా మరికొందరు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ కూడా ఈ వైరస్ బారినపడి నట్లు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ కరో నా వైరస్ లక్షణాలు కనిపించడంతో.. వైద్యునికి సంప్రదించగా భయపడాల్సింది ఏమీ లేదు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంట తెలియజేశారట. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం హౌమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. సీనియర్ యాక్టర్ గా, ఎన్నో సినిమాలలో అలరించారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండే పాత్రలు ఎంచుకుంటూ ఉన్నారు.

ఈ మధ్య కాలంలోనే సేనాపతి అనే సినిమాలో నటించి మరొకసారి తన నటనని నిరూపించుకున్నాడు.ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరి కొత్తగా కనిపించారని చెప్పవచ్చు.ఈ మూవీ చూసిన కొంతమంది సెలబ్రిటీస్ ఈయన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయిందని రాజేంద్రప్రసాద్ ఆనందం లో ఉండగా.. రాజేంద్ర ప్రసాద్ కు కరోనా సోకడంతో ఆయన అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: