ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించినది. ఇక కార్తీ విషయానికొస్తే విభిన్నమైన కథలను ఎంచుకుని అభిమానులందరినీ ఆకట్టుకుంటాడు కార్తీ. సాధ్యమైనంత వరకు రొటిన్కు భిన్నంగా ఉండే కథలను చేయడానికే ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు ఈ ఇద్దరు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ ఇద్దరూ కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా తమిళ రీమేక్లో చేయనున్నట్టు వార్తలు వినిపించాయి.
ఇప్పటికే సినిమాను తెలుగులోపవన్ కల్యాణ్, రానా ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో భీమ్లానాయక్గా విడుదలవుతోంది. తొలుత జనవరి 14 విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ ఆ తరువాత ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయ్యప్పనుమ్ సినిమా తమిళ రీమేక్లో సూర్య, కార్తీ నటించడం లేదు అని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్నారని, త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పుకుంటున్నారు. మర చూడాలి వీరి మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది.
‘