మోహన్ బాబు నట వారసురాలు అయిన మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఇటీవల మంచు లక్ష్మీ కరోనా బారిన పడడంతో ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన చెందారు.

త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే అభిమానులందరు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుండగా,మంచు లక్ష్మీ మాత్రం ఫుల్‌గా చిల్ అవుతుందట.. తనకు కరోనా సోకడంతో కరోనా పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను అంటూ మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక ఈ క్వారంటైన్ సమయంలో మంచు లక్ష్మీ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోన్నారు. మంచు లక్ష్మీ మొన్న ఓ సినిమాను కూడా చూశారు. ఇక నిన్న పుష్ప సినిమాను వీక్షించారట... మొన్న మిన్నల్ మురళీ అనే సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు 

స్పైడర్ మెన్ తరువాత నాకు అంతగా నచ్చిన చిత్రమిదేనంటూ మంచు లక్ష్మీ ప్రశంసలు కూడా కురిపించారు.ఇక ఆమె కూతురు విద్యతో కలిసి ఒకే చోట ఉంటున్నారు మంచు లక్ష్మీ. అయితే క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూనే కూతురికి కూడా దూరంగా ఉంటున్నారు. కషాయాన్ని తాగుతూ ఉన్న ఫోటోను మరియు వీడియోను మంచు లక్ష్మీ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నారట..

ఇక ఈ కొత్త వేరియంట్ మీదు వచ్చిన ఓ జోక్‌ను మంచు లక్ష్మీ పోస్ట్ చేశారు. ఈ కొత్త వేరియంట్‌కు ఈ లక్షణాలు ఎందుకు లేవు అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేశారట మంచు లక్ష్మీ. ఈ వేరియెంట్‌కు మంచి లక్షణాలు ఎందుకు లేవు వెయిట్ లాస్, సిల్కీ హెయిర్ అలాగే క్లియర్ స్కిన్ వంటి లక్షణాలు అస్సలు ఎందుకు లేవు అని మంచు లక్ష్మీ ఓ పోస్ట్ చేశారు.

ఇక తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేస్తూ క్వారంటైన్ లైఫ్ ఎలా గడుస్తుందో చూపించిందట.. ఇందులో తను తనే ఫుడ్ వాడే టాబ్లెట్స్ మరియు ఇంట్లోని వాతావరణం తదితర అంశాలను కూడా చూపించింది. మంచు లక్ష్మీ వీడియోపై నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: