నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ. టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ నటించింది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇదివరకే సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కడంతో ఈ సినిమా అనౌన్స్ చేయడం తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాను నుండి  చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, పోస్టర్, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఎన్నో అంచనాలతో 2 డిసెంబర్ 2021 వ తేదీన థియేటర్ లో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

అఖండ సినిమాతో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా కంటే ముందు మాత్రం బాలకృష్ణ వరుస అపజయాలతో డీలా పడిపోయాడు. అలాంటి సమయంలో అఖండ సినిమాతో బాలకృష్ణ మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇది ఇలా ఉంటే అఖండ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ తదుపరి సినిమాకు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని అనేక వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. బాలకృష్ణ అఖండ సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ 12 నుండి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఒక టాక్ నడుస్తోంది. అయితే అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ కు ఆ మాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వడం పెద్ద విషయమే కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: