టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం అతడు ఇంకా ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబినేషన్ లో మరోసారి ముచ్చటగా మూడో సినిమా ఫిక్స్ కాగా అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఇక అతడు సినిమా హిట్ , ఖలేజా భారీ ప్లాప్ అయినా కానీ త్రివిక్రమ్ మహేష్ బాబును కొత్తగా చూపిస్తారని అభిమానులు ఎంతగానో భావిస్తారు. త్రివిక్రమ్ సన్నిహిత బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ తెరకెక్కనుంది.

కరోనా మహమ్మారి సోకడంతో అంత్యక్రియలకు హాజరు కాని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.అది 'ఇక నువ్వే నా ఆదర్శం.. నువ్వే నా యొక్క ధైర్యం.. నువ్వే నా బలం.. నా కొరకు నువ్వు చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు.. నువ్వు లేకపోతే నేను కేవలం సగం మాత్రమే.. ఇకనుంచి నువ్వు కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకో.. నిన్ను ఎప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉంటాను..నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య' అంటూ మహేష్ సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు.

ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో రమేష్ బాబుపై మహేష్ బాబుకు ఎంత అభిమానమో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మహేష్ బాబు చాలా దిగులుగా ఉన్నారని ఏం జరిగిందని అడిగితే అన్న రమేష్ బాబు జ్వరంతో బాధ పడుతున్నారని మహేష్ చెప్పారని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. షూటింగ్ ఆపేద్దామని తాను చెప్పినా భారీ బడ్జెట్ సినిమా కావడంతో బాధతోనే మహేష్ షూటింగ్ లో పాల్గొన్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.ఇక షూటింగ్ పూర్తైన తర్వాత మహేష్ బాబు వెంటనే ఆస్పత్రిలో ఉన్న తన రమేష్ బాబును చూడటానికి వెళ్లారని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. రమేష్ బాబు మహేష్ బాగోగులను చూసుకున్నారని ప్రేక్షకులకు కూడా తెలియని షాకింగ్ విషయాలను త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: