తెలుగు సినిమా పుట్టి ఏడు దశాబ్దాలు అవుతుంది. ఈ ఏడు దశాబ్దాలలో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్టీలోకి వచ్చారు.. కనుమరుగయ్యారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. ఇక అప్పట్లో స్టార్ హీరోల పక్కన తెలుగు హీరోయిన్లు నటించి సూపర్ డూపర్ హిట్ విజయాలను సొంతం చేసుకున్నారు. కాగా.. తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరోయిన్‌గా రాణించిన ఓ మహిళా స్టేజ్‌ మీదే పుట్టారంట. ఆమె ఎవరో ఒక్కసారి చూద్దామా.

అయితే ఓ నాటకం జరుగుతుండగా.. స్టేజ్ మీద జన్మించిన ఈ నటి పేరు కమలాబాయి. ఆమె నేటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండదు. ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మొదటి హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. 1908వ సంవత్సరంలో సురభి నాటక సంస్థ గుంటూరులో నాటక ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఒక నటికి పురిటి నొప్పులు రావడంతో అదే స్టేజి పైన ఓ బిడ్డకు జన్మనించారని పలువురు చెప్పుకొచ్చారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో  ఆమె మొట్టమొదటి హీరోయిన్‌గా రికార్డు సాధించారు. అంతేకాదు.. ఆమెకి సహజనటిగా మంచి గుర్తింపు లభించింది. ఆమె భక్త ప్రహ్లాద సినిమాలో లీలావతి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో పాటు నాట్యకళలో కూడా ఆమె సత్తా చాటుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న కమలాబాయి హీరోయిన్ సక్సెస్‌ఫుల్‌గా రాణించారు. అలాగే తన మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఆమె ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమాలో తోట రాముడికి తల్లి పాత్రలో కనిపించారు. ఆ తరువాత 1953లో వచ్చిన అమ్మలక్కలు సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. కమలాబాయి తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కిన ఆమె కెరీర్ చివరి దశలో అవకాశాలు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమలాబాయి ఇబ్బందులను తెలుసుకుని ఎన్టీఆర్ ఆమెకి అండగా నిలబడ్డారని పలువురు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: