టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్ సమంత మానసికంగా చాలా ఇబ్బంది పడుతుందనిపిస్తుంది.ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ల ద్వారా తన స్థితిని తెలియజేస్తూనే ఉంది.ఆ పోస్ట్ లు చూస్తుంటే విడాకులు ఆమె జీవితాన్ని ఒక రకంగా బాగా కుదిపేసినట్లే కనిపించింది. తాజాగా మరోసారి సమంత తన బాధను పరోక్షంగా బయటపెట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీలో కొత్తగా మొదలైన ఒక కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సమంత చీఫ్ గెస్ట్ గా హాజరైంది.ఇక ఆ సందర్భంగా సమంత డిప్రెషన్ వలన తలెత్తే సమస్యల గురించి ఇంకా ఆ సమయంలో సన్నిహితుల సహకారం ఎంత అవసరం ఇంకా అలాగే మానసిక వైద్యుల నుంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యమనే విషయాలపై సమంత మాట్లాడింది. ఇక వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు అనేవి ఎదురైనప్పుడు కుంగిపోకూడదని.. మన చుట్టూ ఉన్న వారి సహాయం తీసుకోవాలని సమంత సూచించింది.

తన జీవితంలో కష్టమైన సందర్భాలను ఎదుర్కొన్నానని.. అప్పుడు తన సన్నిహితులే తనకు ఎంతో అండగా నిలిచారని ఆమె తెలిపింది.మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు సన్నిహితుల నుంచి సాంత్వన పొందడం అనేది చాలా అవసరమని చెప్పింది.ఇక మొహమాట పడకుండా అలాంటి సమయాల్లో దగ్గరి వాళ్లతో మాట్లాడాలని సమంత తెలిపింది.ఇక అంతేకాకుండా.. అవసరమైనప్పుడు మానసిక వైద్యుల సాయం పొందడం కూడా చాలా అవసరమని సమంత చెప్పుకొచ్చింది. మానసిక చికిత్స కేంద్రాల అవసరం చాలా ఉందని కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది సమంత. ఇక ఈ విషయాలను తాను ఎమోషనల్ గా చెబుతున్న సమయంలో.. సమంత కళ్లల్లో నీళ్లు కూడా కనిపించాయి.అయితే నెటిజన్స్ మాత్రం సమంతని ఇంకా ట్రోల్ చేస్తూనే వున్నారు. సమాజంలో మంచి మంచి పొజిషన్లో వున్న వారికి భావి తరాలకు ఆదర్శంగా నిలిచే వారిని పిలవకుండా ఇలాంటి హీరోయిన్స్ ని ఎందుకు చీఫ్ గెస్టులుగా ఎందుకు పిలుస్తారాని సమంత నీకు నీతులు బోధించే అర్హత లేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: