టాలీవుడ్ లో ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చ జరుగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెరకెక్కుతుందో అని చర్చ ఇప్పుడు జరుగుతూ ఉండగా తొందర్లోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఇద్దరు కూడా సమాధానం చెప్పడం అందరిలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక విషయం ఇప్పుడు ఎంతో చర్చగా మారింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకత్వం చేయడం ప్రారంభించి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా అందుకోలేదు రాజమౌళి.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జక్కన్న. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదల కు సిద్ధంగా ఉంచాడు. అయితే ఆ సినిమా కాస్తా కరోనా కారణంగా పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి చిత్రం మహేష్ తోనే ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే గతంలో రామాయణం సినిమా చేయాలని మహేష్ బాబు రాముడిగా బాగుంటదని రాజమౌళి భావించగా దానిని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడట. 

ఎందుకంటే ఒకవేళ ఆ సినిమా చేస్తే సమయం ఎక్కువగా తీసుకుంటుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా చేయడం సరి కాదని భావించి ఈ సినిమాకు నో చెప్పాడు మహేష్ బాబు.  ఇప్పుడు చేయబోయే సినిమాజోనర్ లో ఉంటుంది అనేది చూడాలి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేల ఈ సినిమా ఉండబోతుంది అని అర్థం అవుతుంది. మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సర్కార్ వారి పాట అలాగే త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఇటు రాజమౌళి కూడా ఆర్.ఆర్.ఆర్ పనులను పూర్తి చేసి విడుదల చేసి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నం కానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: