ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కియారా అద్వానీ, దిశాపటాని లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇకపోతే ఇప్పట్లోనే కాదు కొన్ని దశాబ్దాల కిందట కూడా ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ జూహి చావ్లా  ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.



 అయితే జుహీ చావ్లా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి కెరీర్ను ఎలా ముందుకు నడిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించచి ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా అవతారమెత్తాడు.అయితే కలియుగ కర్ణుడు అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఆయన తనయుడు రమేష్ బాబు కూడా కలిసి నటించారు. 1988 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో జుహీచావ్లా రమేష్ బాబు కు జోడీగా నటించి అలరించింది.


 ఇక ఇదే సినిమా అటు జుహీ చావ్లా కు టాలీవుడ్ లో హీరోయిన్ గా మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ రమేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడిగా జయప్రద నటించగా రమేష్ బాబు సరసన జుహీ చావ్లా నటించింది. అయితే రమేష్ బాబు జుహీచావ్లా జోడి కి ఎంతగానో మంచి గుర్తింపు వచ్చింది. అయితే మొదటి సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేందుకు జుహీ చావ్లా పేరు మీనా గా మార్చాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత జూహి చావ్లా వరుస అవకాశాలు అందుకుంది. అయితే కృష్ణ పెట్టిన పేరు తో కాకుండా జుహీ చావ్లా పేరుతోనే  మిగతా సినిమాలు చేసి కృష్ణ కి షాక్ ఇచ్చింది హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: