టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -కన్నడ హాట్ రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం 'పుష్ప'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజిలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక పుష్ప మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. ఇక మొదటి రోజు ఏపీ తెలంగాణాలో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ టాక్ తో ఎలాంటి సంబంధం లేకుండా భారీ వసూళ్ళనే రాబట్టింది ఈ చిత్రం.ఇక తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ కూడా మంచి టాక్ ని సంపాదించుకొని ఇప్పటికీ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఇక ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ కూడా 'పుష్ప' సినిమా కలెక్షన్లు మాత్రం అసలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు.ఇక 'పుష్ప ది రైజ్' సినిమా కి అన్ని వెర్షన్ లు కూడా కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది.ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఇక 24 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.156.42 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.అలాగే ఇప్పటిదాకా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.10.42 కోట్ల లాభాలను అందించింది. అంతా బాగానే వుంది కానీ ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం ఈ సినిమా వల్ల చాలా భారీగా నష్టపోయారు.ఇక ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ 'పుష్ప' సినిమా ఇంకా మంచి డీసెంట్ కలెక్షన్లను రాబడుతూనే ఉంది.ముఖ్యంగా హిందీలో అయితే ఈ చిత్రం దూకుడు ఇంకా తగ్గలేదు.అక్కడ స్టార్ హీరోల సినిమాలకు పోటీగా పుష్ప సినిమా వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకి అక్కడ వస్తున్న వసూళ్లు చూసి అక్కడి స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: