నిజానికి ఆ ఏడాది సంక్రాంతి కానుకగా చాలాకాలం గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం. 150, బాలకృష్ణ- దర్శకుడు క్రిష్ కాంబోలో వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా విడుదలయ్యాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య వస్తే ఇబ్బంది తప్పదనుకుని అప్పట్లో కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారు. అయితే దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ తమ చిత్రంపై మంచి నమ్మకం ఉండటంతో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలున్నా వెరవకుండా తమ సినిమాను రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే సంక్రాంతికి పోటీలో నిలిచిన ఈ మూడు చిత్రాలు ఘన విజయం సాధించి ఈ సీజన్ ప్రత్యేకతను చాటి చెప్పాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే ఈ సినిమా కథకూ సంక్రాంతి పండుగకూ కూడా సంబంధం ఉండటం. దర్శకుడు సతీష్ తన సొంత ప్రాంతమైన గోదావరి జిల్లాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ సాగుతుంది. సంక్రాంతి సందడి, మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాలు, బావామరదళ్ల సరసాలు ఇవన్నీ గొప్పగా పండటంతో ఇది ఓ మంచి సంక్రాంతి చిత్రంగా చాలాకాలం గుర్తుంచుకునే స్థాయిని సొంత చేసుకుంది.
నిజానికి ఆ ఏడాది సంక్రాంతి కానుకగా చాలాకాలం గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం. 150, బాలకృష్ణ- దర్శకుడు క్రిష్ కాంబోలో వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా విడుదలయ్యాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య వస్తే ఇబ్బంది తప్పదనుకుని అప్పట్లో కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారు. అయితే దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ తమ చిత్రంపై మంచి నమ్మకం ఉండటంతో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలున్నా వెరవకుండా తమ సినిమాను రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే సంక్రాంతికి పోటీలో నిలిచిన ఈ మూడు చిత్రాలు ఘన విజయం సాధించి ఈ సీజన్ ప్రత్యేకతను చాటి చెప్పాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే ఈ సినిమా కథకూ సంక్రాంతి పండుగకూ కూడా సంబంధం ఉండటం. దర్శకుడు సతీష్ తన సొంత ప్రాంతమైన గోదావరి జిల్లాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ సాగుతుంది. సంక్రాంతి సందడి, మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాలు, బావామరదళ్ల సరసాలు ఇవన్నీ గొప్పగా పండటంతో ఇది ఓ మంచి సంక్రాంతి చిత్రంగా చాలాకాలం గుర్తుంచుకునే స్థాయిని సొంత చేసుకుంది.