టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయం తరువాత సాక్షి, గూఢచారి 116 వంటి సినిమాలు నటుడిగా కృష్ణ కు విజయాల్ని అందించాయి. ఇక అక్కడి నుండి వరుసగా అనేక ఛాన్స్ లు అందుకుని హీరోగా తిరుగులేని స్టార్డం సంపాదించిన కృష్ణ, ఆపైన మొత్తంగా తన కెరీర్ లో 350 కి పైగా సినిమాలు చేసి సూపర్ స్టార్ గా ఎందరో ప్రేక్షకాభిమానుల మనసు గెలుచుకున్నారు.

ఇక కొన్నేళ్ల క్రితం మొదట పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తరువాత చిన్న కుమారుడు మహేష్ బాబు లని హీరోలుగా టాలీవుడ్ కి పరిచయం చేసిన కృష్ణ, ఆ తరువాత చాలా వరకు అక్కడక్కడా ప్రత్యేక పాత్రలకె పరిమితం అయ్యారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తండ్రి నట వారసత్వంతో టాలీవుడ్ లో పెద్ద సూపర్ గా గొప్ప క్రేజ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్ల క్రితం కృష్ణ సతీమణి విజయనిర్మల హఠాత్తుగా మరణించడంతో మానసికంగా కొంత కృంగిపోయిన కృష్ణ, మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మరణించడం వలన మరింతగా కృంగిపోయారు.

అప్పట్లో హీరోగా రమేష్ బాబు కెరీర్ పై ఎంతో బాగా దృష్టి పెట్టిన కృష్ణ, ఆయన ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఒకింత లోలోపల కొంత మధనపడేవారట. ఇక ప్రస్తుతం రమేష్ మరణం నిజంగా కృష్ణకి తీరని లోటు అనే చెప్పాలి. ఇప్పటికే డెబ్భై ఐదేళ్లు పైబడ్డ కృష్ణ కి వరుసగా ఇటువంటి విషాద ఘటనలు ఎదురవుతూ ఉండడం ఎంతో విచారకరం అని, ఈ సమయంలో ఆయనకి అలానే ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని, ప్రశాంతతని అందించాలని పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడా కోరుతున్నారు
 

మరింత సమాచారం తెలుసుకోండి: