ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుండగా త్వరలో మరొక రెండు సినిమాలు పట్తలెక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. ముందుగా సాగర్ కె చంద్ర తో ఆయన చేస్తున్న భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుండగా, ఆ తరువాత మరికొన్ని నెలల అనంతరం క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు విడుదల కానుంది.

బీమ్లా నాయక్ లో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపంచనుండగా, దగ్గుబాటి రానా కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హరిహర వీరమల్లు లో యోధుడు వీరమల్లు పాత్ర లో పవన్ కనిపించనుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ రెండు మూవీస్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, అలానే ఆపైన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, మొత్తం ఈ నాలుగు సినిమాల తరువాత మరొక రెండు సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తారని, ఆపైన 2024లో తన జనసేన పార్టీ తరపున మరొక్కసారి పోటీ చేయనున్న పవన్, అక్కడి నుండి పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటిస్తారు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది.

వాస్తవానికి పవన్ ఎప్పుడో సినిమాలు ఆపేద్దాం అని భావించారని, అయితే అంతకముందు పలువురు దర్శక నిర్మాతలు పవన్ తో సినిమాలు చేయడానికి సిద్ధం అవడంతో అవి పూర్తి అయ్యాక సినీ పరిశ్రమకి వీడ్కోలు పలికి పూర్తిగా తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేస్తారని ఆయన సన్నిహిత వర్గాల్లో కొందరు చెప్తున్నట్లు సమాచారం. అయితే పవన్ నిజంగానే 2024 తరువాత పూర్తిగా సినిమాల నుండి తప్పుకుంటారా లేదా అనే దానిపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే ఆయన నుండి అధికారికంగా న్యూస్ బయటకు వస్తే తప్ప నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: