బాలయ్య హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన లేటెస్ట్ బిగ్గెస్ హిట్ మూవీ అఖండ. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు చేయగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్ లో నిర్మించారు. ఇక ఈ సినిమా విజయంతో మళ్ళి కెరీర్ పరంగా మంచి ఫామ్ లోకి వచ్చారు బాలయ్య.

మంచి యాక్షన్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా బోయపాటి తీసిన ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా రెండు పాత్రల్లో బాలయ్య అత్యద్భుత నటనకి ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇక నాని హీరోగా యువ దర్శకడు రాహుల్ సంకృత్యాన్ తీసిన లేటెస్ట్ హిట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా మిక్కీ జె మేయర్ దీనికి సంగీతం అందించారు. నాని డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక రెండు రోల్స్ లో నాని యాక్టింగ్ అదరగొట్టగా ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ పాత్రకి అందరి నుండి మరింతగా పేరు లభించింది.

అయితే విషయం ఏమిటంటే, సరిగ్గా మరికొద్దిరోజుల్లో అనగా జనవరి 21న ఈ రెండ్ సినిమాలు కూడా ప్రేక్షకాభిమానులకి ఓటిటి ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ముందుగా బాలయ్య అఖండ సినిమాని డిస్నీ హాట్ స్టార్ వారు భారీ ధరకు కొనుగోలు చేసి ఆరోజున రిలీజ్ చేస్తుండగా, ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు నాని శ్యామ్ సింగ రాయ్ మూవీని అత్యధిక ధరకు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా త్వరలో ఒటిటి ద్వారా అటు బాలయ్య, ఇటు నాని ఇద్దరూ కూడా ఓటిటి ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి రాబోతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఓటిటి ప్రేక్షకులని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: