తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. వచ్చే అవకాశాలు ఉంటాయని ఎన్నో సినిమాలలో నటించి నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని.. ఆ తరువాత అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల గురించి తెలుసుకోవడం కోసం ఎంతోమంది ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపుతూ ఉంటారు.. అలాంటి హీరోయిన్లలో హీరోయిన్ లయ కూడా ఒకరు. తన నటనతో అమాయక చూపుల తో బాగా పేరు తెచ్చుకుంది. మొదటిసారిగా బాలనటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత నెమ్మదిగా హీరోయిన్ గా ఎదిగింది. తన మొదటి సినిమా స్వయంవరం అనే  సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అభిమానులను బాగా సంపాదించింది.కెరియర్ బాగా సాగుతున్న సమయంలో వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇక ఆ తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ తర్వాత అమెరికా కు వెళ్లి అక్కడే సెటిల్ అయినట్లుగా సమాచారం. అయితే తన కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్నట్లు గా సమాచారం.. అంతేకాకుండా ఇటీవల కాలంలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లుగా ఒక వార్త బయటికి వచ్చింది. దీంతో ఆమె అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో అవకాశం వచ్చింది.. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక ఈమె పాత్ర కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత ఈమె ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇక తన భర్త పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో చూడముచ్చటగా ఉన్నది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: