టాలీవుడ్ లో మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన సినిమా ప్రస్థానం మొదలెట్టిన దిల్ రాజు, ఆ తరువాత వినాయక్ దర్శకత్వంలో నితీన్ హీరోగా తెరకెక్కిన దిల్ మూవీ తో నిర్మాతగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై రాజు నిర్మించిన ఆ మూవీ అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుండి వరుసగా అనేకమంది టాలీవుడ్ స్టార్స్ తో పాటు పలు యువ హీరోలతో కూడా సినిమాలు చేసి టాలీవుడ్ లో నిర్మతగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న దిల్ రాజు, ప్రస్తుతం పలు ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ చేస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం తన తమ్ముడు శిరీష్ తనయుడైన ఆశిష్ ని హీరోగా పెట్టి దిల్ రాజు నిర్మించిన సినిమా రౌడీ బాయ్స్. తొలి సినిమా అయినప్పటికీ కూడా హీరోగా ఆశిష్ ఎంతో బాగా నటించారని తప్పకుండా రిలీజ్ తరువాత రౌడీ బాయ్స్ మూవీ సూపర్ హిట్ కొట్టడం, హీరోగా ఆశిష్ మంచి పేరు దక్కించుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఎన్టీఆర్ నిన్న రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకెళ్తోంది.

మరోవైపు తనయుడి సినిమా కోసం టాలీవుడ్ లోని పలువురు స్టార్స్ సపోర్ట్ తీసుకుంటే సినిమాకి రీచ్ బాగుంటుందని భావించిన దిల్ రాజు, ఇప్పటికే ఎన్టీఆర్ తో ట్రైలర్ రిలీజ్ చేయించారు, అనంతరం ఈ సినిమా ప్రమోషన్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించనున్నారని, ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఏకంగా ఒక చిన్న క్యామియో రోల్ చేయించారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదుగాని ఒకవేళ అదే కనుక నిజం అయితే రౌడీ బాయ్స్ మూవీకి రామ్ చరణ్ మంచి హెల్ప్ అవుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: