టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ దర్శకుడిగా ఉన్న దర్శకుడు ఎవరంటే తప్పకుండా అందరికీ రాజమౌళినే గుర్తుకు వస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనే కా దు దేశ వ్యాప్తంగా కూడా ఈ దర్శకుడు ప్రేక్షకులు ఆశ్చర్యపోయే సినిమాలను తెరకెక్కించి తనని నిరూపించుకుంటూ వస్తున్నాడు. అందుకే దేశంలోని టాప్ 5 దర్శకులలో రాజమౌళి ఒకడు ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో నెంబర్ వన్ స్థానం లో కూడా జక్కన్న ఉంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

బాహుబలి సినిమా ను దేశం మొత్తం నచ్చేలా చేసిన రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో కూడా మరొక సారి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే సినిమా తో రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రాజమౌళి తర్వాత స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా జరుగుతుంది. అయితే పాన్ ఇండియా సినిమా దర్శకుడుకి మాత్రమే ఈ స్థానం దక్కుతుంది అన్న చర్చలు ఇప్పుడు జరుగుతు ఉండడం విశేషం. తెలుగు సినిమా స్థాయిలో చాలా మంది దర్శకులు సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు.

అయితే పాన్ ఇండియా సినిమా చేయాలంటే చాలా ధైర్యం తో పాటు చాలా టాలెంట్ కూడా ఉండాలి. ఇలాంటి దర్శకులు మన టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. అలా ఇటీవల కాలంలో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించి రాజమౌళి తర్వాత స్థానాన్ని దగ్గించుకోవడానికి పోటీ పడుతున్నాడు దర్శకుడు సుకుమార్. ఆయన తొలి సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు వైవిధ్య భరితమైన సినిమాలను చేసి మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఆసక్తి గా మారింది.  ఇప్పుడు పుష్ప సునామి చుస్తుంటే సుకుమార్ రాజమౌళి తర్వాత స్థానాన్ని దాదాపుగా దక్కించుకున్నాడు అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: