టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 30 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో చిరంజీవి. సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా ఆలరించాలని ఆరేంజ్ లోనే సినిమాలను చేస్తూ వస్తున్నాడు. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న చిరంజీవి దేశవ్యాప్తంగా కూడా భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో ఆయన నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రేక్షకులందరికీ మరొక అద్భుతమైన పాత్రలో ఆయన చూసే అవకాశం కల్పిస్తున్నట్లు గా చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరొక  సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచించాడు. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలోనీ గాడ్ ఫాదర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లి దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశాడు. మలయాళ లూసీఫర్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిరు ఇమేజ్ కి తగ్గట్లు గా కొన్ని మార్పులు చేశారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చిరంజీవి నటిస్తున్న తదుపరి సినిమాలో కూడా క్రేజ్ వున్న కొంతమంది నటీనటుల నటింపజేసేలా చేయమని దర్శక నిర్మాతలకు చిరంజీవి సూచిస్తున్నారట. అయితే ఇలా చేయడం పట్ల చిరంజీవి అభిమానులు మాత్రం సంతోషంగా లేరు. చిరంజీవి ఉండగా మరొక క్రేజ్ నటుడు ఉండడం అవసరమా అనేది అభిమానుల వాదన.  అయితే మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో ఇతర భాషలకు సంబంధించిన నటీనటులను పెట్టుకుంటే మంచిది అన్న ఆలోచనతోనే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: